
ఈరోజు వరుసగా 277వ రోజు బుధవారం అంటే ఫిబ్రవరి 22న పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.
కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.
బ్రెంట్ క్రూడ్ 1.2% తగ్గి బ్యారెల్కు $83.05 వద్ద స్థిరపడింది, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) బ్యారెల్కు 0.2% పడిపోయి $76.16కి చేరుకుంది.
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు:
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, , డీజిల్ ధర రూ.89.76
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ.110.48, , డీజిల్ ధర రూ.98.27
అహ్మదాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.96.63, డీజిల్ ధర రూ.92.38
హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04