
రైతులు దేశానికి వెన్నెముక. భారతదేశం వ్యవసాయాన్ని నమ్ముకుంది. కానీ మాకు అన్నం పెట్టే రైతుల బతుకులు బాగుపడటంలేదు. దేశంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒక సారి భారీ వర్షాలు, మరో సారి వర్షాలు కురవక, ధరల హెచ్చుతగ్గులు రైతులను కుంగదీస్తున్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు పనిచేసినా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు నెల జీతంతో సమానమైన డబ్బును సైతం పొందలేక నేటి యువత వ్యవసాయం కాకుండా ఇతర రంగాల్లోకి అడుగుపెడుతున్నారను. అందుకే గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.
దేశంలో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉందని దీని అర్థం కాదు. భారతదేశంలో సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతున్న రైతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఉంది. ఉదాహరణకు ఈశాన్య, ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైతులు సంతోషంగా జీవిస్తున్నారు. MNC కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల కంటే ఈ రైతులు ఆర్థికంగా ధరవంతులు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.
ఈ రాష్ట్ర రైతులకు ఆర్థికంగా శక్తి ఉంది: గణాంకాల ప్రకారం, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైతుల కంటే మేఘాలయలోని రైతులు ధనవంతులు. మేఘాలయలో రైతుల నెలవారీ ఆదాయం 2019లో సగటున రూ.29,348.
మేఘాలయ రైతులు సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడి రైతులు తమ పొలాల్లో యూరియా ఎరువులను వాడరు. ఇక్కడి రైతులు సంప్రదాయ విత్తనాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. మేఘాలయలో రైతులు వరి, మొక్కజొన్నలను పెద్ద ఎత్తున పండిస్తారు. ఉద్యానవన పంటల్లో పైనాపిల్, జాక్ఫ్రూట్, అరటి, నారింజ వంటి పంటలకు ప్రాధాన్యత ఇస్తారు. మేఘాలయలో అల్లం, పసుపు కూడా అధిక పరిమాణంలో పండిస్తారు. మేఘాలయ నుండి వచ్చే పసుపుకు భారతదేశంలో ప్రత్యేక స్థానం ఉంది.
ప్రకృతి మేఘాలయలో రైతులకు సహాయం చేస్తుంది: నీరు మంచి వాతావరణం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి. మేఘాలయ రైతులకు అక్కడి వాతావరణం మంచి పంటలు పండడానికి, డబ్బు సంపాదించడానికి సహాయపడుతుంది. మేఘాలయలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అక్కడి రైతులకు నీటి కష్టాలు ఉండవు.
మేఘాలయ తర్వాత ధనిక రైతులు ఉన్న రాష్ట్రం పంజాబ్. ఆ తర్వాత హర్యానా. పంజాబ్లో వారి నెలవారీ ఆదాయం రూ.26,701 కాగా, హర్యానాలో రైతుల నెలవారీ ఆదాయం రూ.22,841. 2019లో నిర్వహించిన సర్వే ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో రైతుల నెలవారీ ఆదాయం రూ.19,225 కాగా, సిక్కిం రైతులది రూ.12,447గా ఉంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూసిన రైతు చట్టాలపై మేఘాలయా రైతులు సైతం నిరసనలు వ్యక్తం చేశారు. దిల్లీలో కూడా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మేఘాలయ సహా పలు రాష్ట్రాల రైతులు గత ఏడాది నిరసనలు చేపట్టడం గమనార్హం.