బడ్జెట్ 2024 : మధ్యతరగతి వారికి ఏ లాభాలుండబోతున్నాయి?

Published : Jan 30, 2024, 02:44 PM IST
బడ్జెట్ 2024 : మధ్యతరగతి వారికి ఏ లాభాలుండబోతున్నాయి?

సారాంశం

రైతులు, మహిళలు, పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన కొన్ని కీలక సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది.

మధ్యంతర బడ్జెట్ 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, దేశ వ్యాప్తంగా ప్రకటనల గురించి అంచనాలు, ఊహాగానాలు అనేక వెలువడుతున్నాయి. 

ఎన్నికలకు ముందు బిజెపి-ఎన్‌డిఎ ప్రభుత్వం సమర్పించే చివరి బడ్జెట్‌ కాబట్టి.. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఏం ప్రకటించబోతున్నారోనని ప్రజలు అసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ముఖ్యంగా ఆదాయపు పన్నుకు సంబంధించి ఏవైనా చర్యలు తీసుకుంటారా అని తెలుసుకోవాలనుకుంటున్నారు.

స్టాండర్డ్ డిడక్షన్‌లో సంభావ్య పెంపు, ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్‌ల క్రింద మరిన్ని ప్రయోజనాలు లాంటి టాక్స్ పేయర్స్ అయిన ఉద్యోగస్తులకు అదనపు ఉపశమనాన్ని అందించడానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, మధ్యతరగతి ఓటర్లలో ఓట్లు, ఆదరణ పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో ప్రజాకర్షక చర్యలను ప్రకటించడంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

Interim Budget 2024 : ఆర్థికసర్వే చెబుతున్న ఈ ఐదు సవాళ్లు అధిగమించగలదా?

అయితే, ఈ నేపథ్యంలో, ఆర్థిక లోటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను పాలనకు సంబంధించిన ప్రకటనల తర్వాత, మధ్యతరగతి ప్రజలకు పెద్దగా బాణసంచా కాల్చే అవకాశం లేదు.ఆర్థికవేత్తలు బడ్జెట్ ఏముండబోతున్నాయో అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమికంగా మౌలిక సదుపాయాల వ్యయంపై నిరంతర దృష్టి పెట్టడం ద్వారా ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టవచ్చని సూచిస్తుంది. అదనంగా, రైతులు, మహిళలు, పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన కొన్ని కీలక సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది.

ఎదురుచూపులు ఉన్నప్పటికీ, అధికార బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తన రాజకీయ స్థితిపై నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది మూడు కీలక రాష్ట్రాలలో విజయాలు సాధించి, రామమందిర నిర్మాణం విజయవంతం కావడంతో, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వం ప్రజాకర్షక చర్యలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

క్యాపిటల్ ఎకనామిక్స్‌లో డిప్యూటీ చీఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎకనామిస్ట్ షిలాన్ షా, ఎన్నికల సంవత్సరంలో ఆర్థిక తాయిలాల కోసం సంభావ్య ప్రలోభాలను అంగీకరించారు. "ఇది సార్వత్రిక ఎన్నికల సంవత్సరం కాబట్టి, పెద్ద ఆర్థిక బహుమతులను ప్రకటించడానికి అధికార బిజెపి నుండి కనీసం కొంత ప్రలోభం ఉంటుంది" అని షా వార్తా సంస్థ రాయిటర్స్‌తో అన్నారు.

అయినప్పటికీ, ద్రవ్య లోటును అదుపు చేయాలనే దీర్ఘకాలిక ఆశయంతో ప్రభుత్వం తాయిలాల అవసరాన్ని సమతుల్యం చేస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా, రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన చేశారు.

ఇది గణనీయమైన ఉపశమనాన్ని ఆశించే మధ్యతరగతి ప్రజల మనోభావాలను దెబ్బతీసినప్పటికీ, ద్రవ్యోల్బణం నిర్వహణ, సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి ఉద్దేశించిన చర్యలకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటనలపై అందరి దృష్టి ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !