తెలంగాణకు గుడ్ న్యూస్... అమెజాన్ భారీ పెట్టుబడులు...

By Sandra Ashok KumarFirst Published Feb 11, 2020, 11:05 AM IST
Highlights

మెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. 90 శాతం కంటే ఎక్కువ పెట్టుబడితో ఈ రెండు డేటా సెంటర్లలో హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాలపై వెచ్చించనుంది.

హైదరాబాద్: ఈ కామర్స్ టెక్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. దాదాపు  11,624 కోట్ల (1.6 బిలియన్) వ్యయంతో రెండు డేటా సెంటర్ల నిర్మాణానికి తెలంగాణ రాష్టాన్ని అనుమతి కోరింది.

రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ శివార్లలో రెండు ప్రదేశాలలో ఈ డేటా సెంటర్లు నిర్మించనున్నట్లు భావిస్తున్నారు. ఈ రెండు డేటా సెంటర్లలో 90 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి  హై-ఎండ్ కంప్యూటర్ , స్టోరేజ్ పై వెచ్చించనుంది. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్  అభివృద్ధి చేయడంలో దోహదపడనున్నాయి.

also read 400 పాయింట్లకు పైగా దూసుకుపోతున్న సెన్సెక్స్ ..లాభాల మధ్య నిఫ్టీ...

షాబాద్ మండలంలోని చందన్‌వెల్లి గ్రామంలో ఒక డేటా సెంటర్‌ను ప్రతిపాదించగా మరొకటి కందూకూర్ మండలంలోని మీర్‌ఖన్‌పేట గ్రామంలో ప్రతిపాదించారు. ఇది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ కింద భూములను ఎంచుకుంది.

డేటా సెంటర్ల నిర్మాణానికి పర్యావరణ అనుమతి కోరుతూ అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎడిఎస్‌ఐపిఎల్) చేసిన ప్రతిపాదనలను ఇప్పటికే జనవరి 31 న జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నిపుణుల కమిటీ (ఎస్‌ఐసి) సిఫారసు చేసింది.

 ఎడిఎస్‌ఐపిఎల్ అందించిన పత్రాల ప్రకారం చందన్‌వెల్లిలోని డేటా సెంటర్ నిర్మాణం కోసం 66,003 చదరపు మీటర్లు (చదరపు మీటర్లు), మీర్‌ఖన్‌పేట్ వద్ద ఇది 82,833 sq.m. దరఖాస్తు చేసుకుంది.పర్యావరణ క్లియరెన్స్, ఇతర సంబంధిత అనుమతులను కోరుతూ కేంద్ర, రాష్టాల లేఖను పంపించింది.

also read కరోనా ఎఫెక్ట్: ముడి సరుకుకొరత..సవాళ్ల ముంగిట ఫార్మా ఇండస్ట్రీ

ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 ప్రకారం 20,000 చదరపు మీటర్ల మించి నిర్మించిన విస్తీర్ణంతో ఏదైనా నిర్మాణ ప్రాజెక్టుకు పర్యావరణ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఇది కాకుండా దేశంలో ఇంటర్నెట్, స్మార్ట్ పరికరాల వినియోగదారుల పెరుగుదల, సేవలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మార్చడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రణాళికలు దాని అనుకూలంగా పనిచేస్తాయి.

ఈ రెండు డేటా సెంటర్ల ద్వారా దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని అమేజాన్ తెలిపింది. 2024 నాటికి దేశంలో మొత్తం 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.

click me!