
అక్షయ తృతీయ వచ్చేసింది. ఈ రోజు బంగారంలో పెట్టుబడి పెట్టడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ అక్షయ తృతీయకు ఆభరణాల వ్యాపారులు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు. ఈసారి సేల్స్ ప్రీ-కోవిడ్ స్థాయిని మించి అంటే 2019కి చేరుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ (india) సోమసుందరం పిఆర్ మాట్లాడుతూ, “అక్షయ తృతీయ నాడు లక్షలాది మంది ప్రజలు సంప్రదాయకంగా ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. మీరు కూడా బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఐదు విషయాలను గుర్తుంచుకోండి.
హాల్మార్క్ ఉన్న ఆభరణాలను కొనండి: షాపింగ్ చేసేటప్పుడు బంగారం స్వచ్ఛతను గుర్తుంచుకోండి. హాల్మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయండి. క్యారెట్ కాకుండా మీరు స్వచ్ఛతను కూడా చెక్ చేయవచ్చు. దీనికి సంఖ్యలు కూడా ఉన్నాయి. 916 అంటే నాణెం 999.9% స్వచ్ఛమైనది.
బిల్లు కోసం తప్పకుండా అడగండి: బంగారం కొనుగోలుకు సంబంధించిన బిల్లును తప్పకుండా తీసుకోండి. అందులో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు, మేకింగ్ ఛార్జీలు, దుకాణదారుడు తదితర పూర్తి వివరాలు ఉండేలా చూసుకోండి.
ప్యాకేజింగ్: గోల్డ్ కాయిన్ ప్యాకేజింగ్ ట్యాంపర్ ప్రూఫ్. దీని ద్వారా నాణెం స్వచ్ఛతను కాపాడుతుంది. దాని ప్యాకేజింగ్ పాడైతే, దానిని విక్రయించడం కష్టం.
బరువు చెక్ చేయండి: బంగారం కొనుగోలు చేసేటప్పుడు, దాని బరువును ఖచ్చితంగా చెక్ చేయండి. చాలా సార్లు వ్యాపారులు బంగారాన్ని తప్పుగా కొలిచి వినియోగదారులను మోసం చేస్తుంటారు.
మేకింగ్ ఫీజు: మేకింగ్ ఫీజు ఆభరణాల ధరలో 30 శాతం వరకు ఉంటుంది. దీనిపై డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా బంగారం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, గ్లోబల్ మార్కెట్లో బంగారం వచ్చే 12 ఏళ్లలో ఔన్స్కి $2,050కి చేరవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.55,000 వరకు చేరుతుంది.