
అదానీ గ్రూప్లోని అన్ని లిస్టెడ్ షేర్లు ఈ వారం ప్రారంభం నుంచే భారీ ర్యాలీలో ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లు 16 శాతం వరకు పెరిగాయి. అదానీ గ్రీన్ షేర్లలో అత్యధిక లాభం కనిపించింది. ఎన్ఎస్ఈలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఏకంగా 15.77 శాతం పెరిగి రూ.2,224కి చేరుకుంది. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఇంట్రాడేలో 9 శాతం వరకు పెరిగాయి. BSEలో 52 వారాల గరిష్ట స్థాయి 2,775.85 రూపాయలకు చేరుకుంది.
అదానీ ట్రాన్స్మిషన్ - అదానీ పవర్ షేర్లలో ర్యాలీ..
అదానీ గ్రూప్లోని మరో లిస్టెడ్ కంపెనీ షేర్లు కూడా పెరిగాయి. బిఎస్ఇలో అదానీ ట్రాన్స్మిషన్ షేరు 6 శాతం పెరిగి రూ.2,697.40కి చేరుకుంది. దీని తర్వాత, ఈ రోజు BSEలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 3.42 శాతం పెరిగి రూ.2,371.55కి చేరుకుంది. అదే సమయంలో అదానీ విల్మార్ షేర్లు 5 శాతం పెరిగి రూ.617.25కి చేరాయి. అదానీ పవర్ షేర్ కూడా 5 శాతం పెరిగి రూ.284.95 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ షేర్లు బీఎస్ఈలో 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది.
అదానీ గ్రూప్లోని మూడు షేర్లు ఈ వారం ఇన్వెస్టర్లకు సిరులు కురిపించే అవకాశం ఉంది. దీని వెనుక కారణం ఏమిటంటే, ఈ స్టాక్లకు జూలై 14న ఎక్స్-డివిడెండ్ ఉంటుంది. అదానీ పోర్ట్, అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ టోటల్ గ్యాస్. ఈ మూడు కంపెనీలు పెట్టుబడిదారులకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ షేర్ల ముఖ విలువలో 25 శాతం నుండి 250 శాతం వరకు డివిడెండ్ ఇవ్వనున్నాయి.
5G రేసులో గౌతమ్ అదానీ
ఈ నెలాఖరులో జరగనున్న 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసిందని తెలియజేద్దాం. 5G స్పెక్ట్రమ్ వేలం రేసులో, అదానీ గ్రూప్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో (JIO) మరియు ప్రముఖ సునీల్ భారతీ మిట్టల్ ఎయిర్టెల్తో ప్రత్యక్ష పోటీని ఎదుర్కోనుంది. విమానాశ్రయాల నుండి పవర్, డేటా సెంటర్ల వరకు తన వ్యాపారాలకు మద్దతుగా ప్రైవేట్ నెట్వర్క్ను నిర్మించడానికి అదానీ గ్రూప్ ఈ స్పెక్ట్రమ్ను ఉపయోగించనుంది.
"ఈ వేలం ద్వారా తదుపరి తరం 5G సేవలను ప్రారంభించేందుకు భారతదేశం సిద్ధమవుతోంది, బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే అనేక అప్లికేషన్లలో తమది ఒకటి" అని అదానీ గ్రూప్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వివిధ తయారీ కార్యకలాపాలలో సైబర్ భద్రతతో పాటు ప్రైవేట్ నెట్వర్క్ నిర్వహణ కోసం ఈ 5G టెక్నాలజీ వాడుతామని ప్రకటించారు.