ఇండియాలోకి బీఎండబ్ల్యూ సరికొత్త బైక్.. ప్రీ బుకింగ్ ద్వారా ఆర్డర్స్..

By Sandra Ashok KumarFirst Published Sep 21, 2020, 12:14 PM IST
Highlights

క్రూజర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ బైకు కోసం శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ రిటైల్‌ అవుట్‌లెట్లలో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ  మోటోరాడ్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘ఆర్‌18 మోడల్‌'ను ఆవిష్కరించింది. క్రూజర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది.

ఈ బైకు కోసం శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ రిటైల్‌ అవుట్‌లెట్లలో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 1,802 సీసీ సామర్థ్యం ఉన్న ఈ బైకుకి ఆరు గేర్లు ఉన్నాయి. 

also read  ఎస్‌యూవీ స్టైల్‌లో మారుతి ఆల్టో నెక్స్ట్ జనరేషన్ మోడల్ కారు.. ...

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 భారతదేశంలో 2 వేరియంట్లలో లభించే క్రూయిజర్ బైక్. దీని లో వెర్షన్ ధర  రూ.18,90,000 (ఎక్స్-షోరూమ్) ధర నుండి టాప్ వెర్షన్ రూ.21,90,000 (ఎక్స్-షోరూమ్) ఉంది.

ఈ బిఎమ్‌డబ్ల్యూ బైకు 89.84 బిహెచ్‌పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 వెనుక, ముందు టైర్లకు డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఈ బిక్ 345 కిలోల బరువు ఉంటుంది.
 

click me!