Maruti Price Hike:మారుతి సుజుకీ కార్ కొనాలనుకుంటున్నారా.. కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్..

By asianet news teluguFirst Published Jan 16, 2023, 6:27 PM IST
Highlights

దేశంలో అత్యంత ఇష్టమైన కార్లలో ఒకటైన మారుతి సుజుకి కార్లు ఇప్పుడు  ఖరీదైనదిగా మారాయి. 2023 సంవత్సరంలో మారుతీ కార్ల ధరలను మొదటిసారి పెంచింది.  16 జనవరి 2023 నుండి కార్ల ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచుతున్నట్లు దేశంలోని అతిపెద్ద కార్ల  తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ప్రకటించింది. అయితే కంపెనీ ఏ కారు ధర ఎంత పెంచింది..? ఏ వేరియంట్ ధర ఎంత వరకు పెరగవచ్చో  తెలుసుకొండి..

మారుతి కార్లు
 దేశంలో అత్యంత ఇష్టమైన కార్లలో ఒకటైన మారుతి సుజుకి కార్లు ఇప్పుడు  ఖరీదైనదిగా మారాయి. 2023 సంవత్సరంలో మారుతీ కార్ల ధరలను మొదటిసారి పెంచింది. 16 జనవరి 2023 నుండి కార్ల ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపింది.

 ధరలు ఎంత పెరుగవచ్చాంటే 
మారుతి సుజుకి అన్ని మోడళ్ల ధరలను కంపెనీ అధికారికంగా పెంచింది. జనవరి 2023లో అన్ని మోడళ్ల  అన్ని వేరియంట్‌లపై  1.1 శాతం పెరుగుదల జరిగింది. దీని తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.

గతంలోనే సమాచారం
కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి కార్ల ధరలను కంపెనీ పెంచుతుందని 2 డిసెంబర్  2022లోనే కంపెనీ తెలియజేసింది. వాహనాల తయారీకి అయ్యే ఖర్చు నిరంతరం పెరుగుతోందని ఇందుకు కారణంగా కంపెనీ తెలిపింది.

సేల్స్ పరంగా 2022 ఏడాది ఎలా ఉందంటే 
2022 సంవత్సరం అమ్మకాల పరంగా కంపెనీకి మెరుగ్గా ఉంది. ఏప్రిల్ 2022 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో, డిసెంబర్ 2022 వరకు, కంపెనీ మొత్తం 11,79,292 వాహనాలను విక్రయించింది. కాగా ఈ కాలంలో కంపెనీ మొత్తం 11,93,114 వాహనాలను తయారు చేసింది. డిసెంబర్ 2022 గురించి చెప్పాలంటే, కంపెనీ ఒక నెలలో మొత్తం 1,12,010 వాహనాలను విక్రయించింది.

కంపెనీ ఏ కార్లను విక్రయిస్తుంది
మారుతి దేశంలో అత్యంత చౌకైన కారు నుండి లగ్జరీ ఇంకా SUV విభాగాల వరకు కార్లను విక్రయిస్తుంది. వీటిలో అల్టో 800, అల్టో K10, ఎస్  ప్రేసో, బలినో, సిలెరియో, ఇగ్నిస్, డిజైర్, స్విఫ్ట్, వాగన్ ఆర్, సియాజ్, బ్రేజా, ఎర్టీగా, ఎక్స్‌ఎల్6, ఈకో వంటి వాహనాలు ఉన్నాయి.
 

click me!