ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గాడిదకు కట్టి నిరసన.. నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన కస్టమర్.. అసలు విషయం ఏంటంటే..?

By asianet news teluguFirst Published Apr 27, 2022, 11:30 AM IST
Highlights

మహారాష్ట్రలోని పర్లీకి చెందిన సచిన్ గిట్టే ఓలా ఎలక్ట్రిక్‌తో తన నిరాశను వ్యక్తం చేయడానికి నిరసనగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాడు. తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని గాడిదకు కట్టి  నగరం చుట్టూ తిరిగాడు అలాగే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ తయారీ కంపెనీని నమ్మవద్దని ప్రజలను కోరాడు.

ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన భద్రతా ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో లోపాలున్నట్లు కొన్ని నివేదికలు తెరపైకి వచ్చాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అయిన కొద్ది రోజులకే పనిచేయడం లేదని ఆరోపించారు. ఓలా ఇ-స్కూటర్ లాంచ్‌కు ముందు చాలా హెడ్‌లైన్స్ చేసింది. కానీ దాని క్లెయిమ్‌ల ప్రకారం పనితీరు లేకపోవడంతో వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. 

మహారాష్ట్రలోని పర్లీకి చెందిన సచిన్ గిట్టే ఓలా ఎలక్ట్రిక్‌తో తన నిరాశను వ్యక్తం చేయడానికి నిరసనగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాడు. తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని గాడిదకు కట్టి  నగరం చుట్టూ తిరిగాడు అలాగే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ తయారీ కంపెనీని నమ్మవద్దని ప్రజలను కోరాడు. డెలివరీ తీసుకున్న ఆరు రోజుల తర్వాత స్కూటర్ పనిచేయడం ఆగిపోయిందని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుడు సచిన్ గిట్టే ఆరోపిస్తున్నారు. 

మీడియా నివేదికల ప్రకారం, సచిన్ గిట్టే మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త. అతను మార్చి 24న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డెలివరీ పొందాడు. అయితే, ఆరు రోజుల తర్వాత స్కూటర్ పనిచేయడం ఆగిపోయింది, ఆ తర్వాత ఓలా ఎలక్ట్రిక్‌ను సంప్రదించారు. ఫిర్యాదును స్వీకరించిన తయారీ సంస్థ  సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ని విచారణ కోసం పంపాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఆ తర్వాత కూడా స్కూటర్ పనిచేయలేదు. 

సచిన్ గిట్టే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ సమస్యలను రిజిస్టర్ చేసుకోవడానికి ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ కేర్‌కు పదేపదే కాల్స్ చేశాడు. అయినప్పటికీ నిరాశ ఎదురైంది,  దీంతో స్కూటర్ యజమాని సచిన్ గిట్టే తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే జిల్లా లేదా డివిజనల్ స్థాయిలో కూడా Olaకి ఎటువంటి ఫిజికల్ డీలర్ నెట్‌వర్క్ లేదా షోరూమ్‌లు లేవు.

 కస్టమర్ కేర్‌ను పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఇ-స్కూటర్ యజమాని  తన నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గాడిదలు, బ్యానర్లు ఖచ్చితంగా ఈ విషయంలో చాలా దృష్టిని ఆకర్షించడంలో సహాయపడతాయి అనుకున్నాడు. నిరసనలు తెలిపేందుకు గాడిదలను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఎంజీ హెక్టార్, ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీకి గాడిదలను కట్టినట్లు గతంలోనూ ఇలాంటి ఘటనలు తెరపైకి వచ్చాయి.  

నివేదిక ప్రకారం, తయారీ సంస్థ స్కూటర్‌కి మరమ్మతులు చేయలేదని లేదా భర్తీ చేయలేదని సచిన్ గిట్టే వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా నివేదించింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక రక్షణ లేదని ఆరోపిస్తూ దీనిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

 పూణెలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఓలా ఎలక్ట్రిక్ వివరణాత్మక దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే దీనికి ముందు ఏప్రిల్ 24న 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓలా  ఎలక్ట్రిక్ స్కూటర్ల ఇతర యజమానులు కూడా వివిధ సమస్యల గురించి ఫిర్యాదు చేశారని కూడా గమనించాలి.

click me!