4నవంబర్ 2018 ఆదివారం రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Nov 4, 2018, 8:08 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం సూచితం. అధికారిక ప్రయాణాలు చేసే సూచనలు ఉంటాయి. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. గుర్తింపుకోసం ఆరాట పడతారు. శ్రమాధిక్యం ఉంటుంది. అనుకున్న పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. పోటీల్లో గెలుపుకై అధిక శ్రమ పడతారు. ఋణభారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు అధికమౌతాయి. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. పరిపాలన సమర్ధత కలిగి ఉంటారు. కళాకారులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సౌకర్యాలపై దృష్టి పెంచుకుంటారు. ఒత్తిడితో సౌకర్యాల సాధన ఉంటుంది.  ఆహారంలో సమయ పాలన పాటించడం మంచిది. కార్యాలయాల్లో జాగ్రత్త అవసరం. ఓం నమఃశివాయ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడితో ఫలితాల సాధన ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాల్లో సంతోషం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. ఓం నమఃశివాయ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మాటల్లో కాఠిన్యత కనిపిస్తుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడులు ఉంటాయి. మధ్యవర్తిత్వాల జోలికి పోకూడదు. కుటుంబంలో కష్టాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నేత్ర సంబంధ లోపాలు ఉంటాయి. సూర్య నమస్కారాలు చేయడం, ఓం నమఃశివాయ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికం. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆలోచనలకు అనుగుణంగా పనుల మార్పు అవసరం. అనవసర ఒత్తిడి తెచ్చుకుంటారు. ప్రయాణాల్లో అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతకు ప్రయత్నం అవసరం. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనవసర ఖర్చులు ఉంటాయి. అధికారులతో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. శయ్యా సౌఔఖ్యం తగ్గుతుంది. విద్యార్థులు అనవసర ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్త పడాలి. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రాజకీయ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. కళాకారులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆదర్శవంతమైన జీవితానికై ప్రయత్నిస్తారు. సమిష్టి ఆదాయాలు వచ్చే సూచనలు. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారు. పరాశ్రయం ఉంటుంది. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : నూతన పరిశోధనలపై ఆసక్తి పెంచుకుంటారు. అవనసర కష్టాలు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. ఆహారంలో సమయపాలన మంచిది. ఇతరులపై ఆధారపడతారు. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. శ్రమకు తగిన ఫలితం రాదు. గొడవల జోలికి పోకూడదు. పరాశ్రయం ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. శారీరక ఇబ్బందులు ఉంటాయి. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

 డా.ఎస్.ప్రతిభ

click me!