చెవిరెడ్డి అనుచరుల వీరంగం: టీడీపీ కార్యకర్తలపై దాడి

By Siva KodatiFirst Published Apr 8, 2019, 10:09 AM IST
Highlights

చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆదివారం రాత్రి కొత్తూరులో వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. 

చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆదివారం రాత్రి కొత్తూరులో వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన కొందరు కొత్తూరు వినాయక్‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

అయినా టీడీపీ శ్రేణులు అక్కడి నుంచి శాంతియుతంగా వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం స్వగ్రమానికి వస్తుండగా వైసీపీ కార్యకర్తలు వారిని మార్గమధ్యంలో అడ్డుకున్నారు.

తమ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలని ఒత్తిడి చేశారు. దీనిని తెలుగుదేశం కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో వైసీపీ కార్యకర్తలు కత్తులు, రాడ్లతో వారిపై దాడికి పాల్పడ్డాయి.

ఈ దాడిలో టీడీపీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కార్యకర్తలను చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పరామర్శించారు. 

click me!