ఎన్నికలవేళ సీన్ రివర్స్...సొంత గూటికి టీడీపీ నేతలు

By ramya NFirst Published Apr 2, 2019, 9:37 AM IST
Highlights

ఎన్నికలు మరింత దగ్గరపడేసరికి కొన్ని ప్రాంతాల్లో సీన్ రివర్స్ అవుతోంది. 

ఎన్నికలు మరింత దగ్గరపడేసరికి కొన్ని ప్రాంతాల్లో సీన్ రివర్స్ అవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో.. పార్టీని వీడీన కొందరు టీడీపీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే...గిద్దలూరు నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా, అప్పడు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డితోపాటు టీడీపీలోకి వచ్చిన గిద్దలూరు, బేస్తవార పేట, కొమరోలు మండలాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు తిరిగి వైసీపీలో చేరారు.
 
కాగా.. రాంబాబుతోపాటు.. వైసీపీలో చేరిన టీడీపీ నేతలు అనూహ్యంగా సోమవారం టీడీపీలో చేరారు. అశోక్ రెడ్డి గెలుపు కోసం పోటీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో గిద్దలూరులో టీడీపీ బలం పెరిగిపోతోందనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి.

click me!