భార్య సమాధి వద్ద కుప్పకూలిన పల్లె రఘునాథ రెడ్డి

By telugu teamFirst Published Apr 10, 2019, 9:35 PM IST
Highlights

భార్య సమాధి వద్ద బుధవారం సాయంత్రం పల్లె రఘునాథ రెడ్డి టెంకాయ కొట్టారు. ఆ తర్వాత మూర్ఛ వచ్చి కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి గుండెపోటుకు గురయ్యారు. సతీమణి సమాధి దగ్గర గుండెపోటుతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

భార్య సమాధి వద్ద బుధవారం సాయంత్రం పల్లె రఘునాథ రెడ్డి టెంకాయ కొట్టారు. ఆ తర్వాత మూర్ఛ వచ్చి కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పల్లె రఘునాథ రెడ్డి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. గత రెండు రోజులుగా నిద్ర, అన్నపానీయాలు లేకపోవడం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని అంటున్నారు. 

సమాధి వద్దకు వచ్చేటప్పుడే కాస్తా అసౌకర్యంగా కనిపించారు. అయితే కొబ్బరి కాయ కొట్టిన వెంటనే ఆయన కుప్పకూలిపోయారు.

click me!