చంద్రబాబు సీఎం కావాలని రాయపాటి యాగాలు

By telugu teamFirst Published May 10, 2019, 10:34 AM IST
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఇటీవల ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి.  కాగా... ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ.... నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు నిర్వహిస్తున్నారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఇటీవల ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి.  కాగా... ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ.... నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు నిర్వహిస్తున్నారు. 

ఈ మేరకు మొర్జంపాడు శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువాం శత చండీయాగం, మహాసుదర్శన యాగాలు నిర్వహించారు. చల్లా శ్రీనివాసశర్మ ఆధ్యర్యంలో పదుల సంఖ్యలో రుత్వికులు శాస్త్రోక్తంగా యాగ కృతువు నిర్వహించారు. గురువారం ప్రారంభమైన ఈ యాగం ఐదువ రోజైన పూర్ణాహుతితో సమాప్తి అవుతుందని శ్రీనివాసశర్మ తెలిపారు.

 ఈ సందర్భంగా ఎంపీ రాయపాటి మాట్లాడుతూ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో నిర్మితమైన శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామీ ఆలయం శ్రీశైల దేవస్థానంతో సమానమైన ప్రాశస్థ్యం పొందిందని వివరించారు.
 

click me!