యాత్ర సినిమాకు ఈసీ గ్రీన్ సిగ్నల్: జోక్యం చేసుకోలేమని టీడీపీకి లేఖ

By Nagaraju penumalaFirst Published Apr 6, 2019, 6:34 PM IST
Highlights

యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ లేఖ రాసింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. 

అమరావతి: తెలుగుదేశం పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. దివంగత సీఎం వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర సినిమా ప్రసారంకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా ఛానెల్ యాత్ర సినిమా ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. 

అయితే యాత్ర సినిమా ప్రసారాన్ని అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నించింది. అందులో భాగంగా టీడీపీ నేతలు ఈసీకి లేఖలు రాశారు. టీడీపీ నేతల లేఖపై స్పందించిన ఈసీ టీవీలో ప్రసారం కానున్న యాత్ర సినిమా ఏరకంగానూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. 

యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ లేఖ రాసింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఆదివారం యాత్ర సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది.  

click me!