మోహన్ బాబు మంచివాడని లక్ష్మీపార్వతి చెబితే.. బుద్ధా వెంకన్న కామెంట్స్

By ramya NFirst Published Apr 1, 2019, 2:42 PM IST
Highlights

సినీ నటుడు మోహన్ బాబుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. మోహన్ బాబు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. 

సినీ నటుడు మోహన్ బాబుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. మోహన్ బాబు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో  మోహన్ బాబు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా.. దీనిపై బుద్ధా వెంకన్న స్పందించారు.

నట ప్రపూర్ణ అని చెప్పుకునే మోహన్ బాబు ఊసరవెల్లిలా ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి గురించి మాట్లాడతారన్నారు. చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్ బాబుకి ఎంత పారితోషికం అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

పారితోషికం ఇవ్వందే ఏమీ మాట్లాడరని సినీ పరిశ్రమలో ఆయనకున్న పేరని ఆరోపించారు. గురువు దాసరికే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోహన్ బాబు అని విమర్శించారు. మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్‌మెంట్ ఇప్పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పించిన ఎన్టీఆర్‌నే మోసం చేశారని, మేజర్ చంద్రకాంత్ సినిమాకు పారితోషికం ఎగ్గొట్టారని విమర్శించారు. జగన్‌కు పెయిడ్ వర్కర్‌గా మారి చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పది రోజులు ఆయన కాల్షీట్లు జగన్‌కు అమ్ముకున్నారని విమర్శించారు.

click me!