డబ్బులు ఇస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లు ఇస్తోందన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన బుధవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
డబ్బులు ఇస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లు ఇస్తోందన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన బుధవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జనరల్ సెగ్మెంట్కు ఓ రేటు.. రిజర్వేషన్ సెగ్మెంట్కు ఓ రేటు పెట్టారంటూ పార్టీ వీడిన వారే చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మోడీ, కేసీఆర్లకు ఊడిగం చేయడానికి జగన్ రెడీ అయ్యారని బాబు ఎద్దేవా చేశారు.
జగన్ కోరేది మార్పు కాదు.. ఏపీ మరణ శాసనమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ చెప్పిన చోటల్లా జగన్ సంతకం పెడతారని సీఎం ఆరోపించారు. తన మాట వినకుంటే జగన్ అవినీతి ఫైల్పై కేసీఆర్ సంతకం పెడతారని బాబు జోస్యం చెప్పారు.
జగన్ ఇంకా ఎన్నో విచిత్ర వేషాలు చూపిస్తారని వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 18వ తేదీ నుంచి లబ్ధిదారులే వచ్చి తెలుగుదేశానికి ప్రచారం చేసే పరిస్ధితి ఉందని తెలిపారు.
తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని పసుపు సైనికులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ, కేసీఆర్, జగన్ అనుబంధం ఈజీ మాజీ డైరెక్టర్ సీబీఐకి రాసిన లేఖ ద్వారా బయటపడిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఈడీ లేఖపై వైసీపీని నిలదీయాలని శ్రేణులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది ముఖ్యమంత్రి వెల్లడించారు. 16వ తేదీన తిరుపతి నుంచి ఎన్నికల శంఖం పూరించి అదే రోజు శ్రీకాకుళంలో పర్యటించునున్నట్లు చెప్పారు.