మంగళగిరిలో నారాలోకేశ్‌కు తప్పిన పెను ప్రమాదం

Siva Kodati |  
Published : Mar 20, 2019, 07:36 AM IST
మంగళగిరిలో నారాలోకేశ్‌కు తప్పిన పెను ప్రమాదం

సారాంశం

మంత్రి నారాలోకేశ్ తృుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన అసెంబ్లీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మంత్రి నారాలోకేశ్ తృుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన అసెంబ్లీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.

స్థానిక నేతల మద్ధతుతో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లోకేశ్ నిడమర్రులో ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ ప్రాంతంలో ప్రసంగిస్తుండగా హోటల్ నేమ్ బోర్డు కూలిపోయింది.

లోకేశ్ సహా మిగిలిన నేతలంతా దానికి దూరంగా ఉండటంతో అది కార్యకర్తల మీద పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్