లగడపాటితో భేటీ: వంగవీటి రాధా టార్గెట్ వైఎస్ జగన్

Published : Mar 06, 2019, 11:49 AM IST
లగడపాటితో భేటీ: వంగవీటి రాధా టార్గెట్ వైఎస్ జగన్

సారాంశం

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని వంగవీటి రాధా అన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరతారని భావిస్తున్నారు.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ మంగళవారం సాయంత్రం మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో సమావేశమయ్యారు. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని వంగవీటి రాధా అన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరతారని భావిస్తున్నారు. ఈ విషయంపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు.

తనను, తన తండ్రి వంగవీటి రంగాను అవమానించేలా జగన్‌ వ్యవహరించారని రాధా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆ పార్టీ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని, అయితే రాజకీయంగా కీలక నిర్ణయం కావడంతో అనుచరులు, సన్నిహితులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటానని, ఆ తర్వాతనే ఓ నిర్ణయం తీసుకుంటానని, అందుకే వేచి చూస్తున్నానని రాధా వివరించారు.

PREV
click me!

Recommended Stories

Anganwadi THR || Food Commission Chairman Inspection in Anganwadi Center | Asianet News Telugu
ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్