సాధినేని యామిని ఫోన్ నెంబర్ ఫేస్ బుక్ లో పెట్టి.. అసభ్యకర కాల్స్

Published : Mar 05, 2019, 12:37 PM IST
సాధినేని యామిని ఫోన్ నెంబర్ ఫేస్ బుక్ లో పెట్టి.. అసభ్యకర కాల్స్

సారాంశం

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీకి ఫోన్ వేధింపులు ఎక్కవయ్యాయి. పలువురు యామనికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. 


టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీకి ఫోన్ వేధింపులు ఎక్కవయ్యాయి. పలువురు యామనికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. దీంతో.. ఆమె పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

యామిని పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె సెల్‌ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి, ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఫోన్లు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు సుధీర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్‌ ఫొటోలతో పాటు అసభ్యకర పదజాలంతో పోస్టింగ్స్‌ పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విధంగా చేస్తున్న వారిలో కొందరిని గుర్తించి వారి పేర్లను ఫిర్యాదులో పొందుపరిచారు. 

వైసీపీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్‌ కలకాల, మానుకొండ రామిరెడ్డి, వైఎస్సార్‌ అశోక్‌, కామిరెడ్డి రాము, మధుసూదనరెడ్డి, లక్ష్మీసుజాత, తదితరులతో పాటు మరికొందరు ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu