ఏపీ సరిహద్దులో బారీగా నగదు పట్టివేత

Published : Mar 06, 2019, 10:00 AM ISTUpdated : Mar 06, 2019, 10:04 AM IST
ఏపీ సరిహద్దులో బారీగా నగదు పట్టివేత

సారాంశం

హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును అధికారులు సీజ్ చేశారు. 

హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును అధికారులు సీజ్ చేశారు. రూ.1.53కోట్ల డబ్బును ట్రక్కులో తరలిస్తుండగా పట్టుకున్నట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు తెలిపారు.

 తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూండి చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.ఆ సమయంలో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ ప్రైవేట్‌ బస్సులో రెండు సూట్‌ కేసుల్లో ఉన్న నోట్ల కట్టలు బయట పడ్డాయి. 

వాటిని లెక్కించగా రూ.1.53 కోట్లని తేలింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నీరజ్‌ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎవరైనా రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడికి తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్