‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని ఆపండి.. ఈసీకి ఫిర్యాదు

Published : Mar 12, 2019, 04:49 PM ISTUpdated : Mar 12, 2019, 06:39 PM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని ఆపండి.. ఈసీకి ఫిర్యాదు

సారాంశం

వివాదాస్పద దర్శుకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట  సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

వివాదాస్పద దర్శుకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట  సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ.. దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఏపీ ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపించేలా ఉందని ఆయన ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాలో చంద్రబాబుని కావాలని నెగిటివ్ గా చూపించారని ఆయన ఆరోపించారు.  ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదు కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్‌లో తలమునకలయ్యాడు. ఈ నెల 22న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయనున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. మరి సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి. 

డైరెక్షన్ చేసి లక్కును పరీక్షించుకున్న టాప్ యాక్టర్స్

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP