తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో వైసీపీదే హవా: విపక్షాలకు సింగిల్ డిజిట్లే

Published : Mar 14, 2021, 03:57 PM ISTUpdated : Mar 14, 2021, 04:10 PM IST
తిరుపతి ఎంపీ  స్థానం పరిధిలో  వైసీపీదే హవా: విపక్షాలకు సింగిల్ డిజిట్లే

సారాంశం

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. విపక్షాలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.


తిరుపతి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. విపక్షాలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఒక్క కార్పోరేషన్, మూడు మున్సిపాలిటీల్లో 125 వార్డులున్నాయి.తిరుపతి కార్పోరేషన్ సహా మూడు మున్సిపాలిటీలను కూడ  వైసీపీ దక్కించుకొంది. 

తిరుపతి కార్పోరేషన్ పరిధిలోని 50 వార్డుల్లో 49 వార్డులను వైసీపీ దక్కించుకొంది. ఒక్క స్థానంలో టీడీపీ మాత్రమే విజయం సాధించింది.చాలా ఏళ్ల తర్వాత ఎన్నికల్లో తిరుపతి కార్పోరేషన్ ను వైసీపీ దక్కించుకొంది.

ఇక నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలో 25 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. సుళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డుల్లో 24 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. ఒక్క స్థానంలో టీడీపీ గెలుపొందింది. ఇదే జిల్లాలోని నాయుడుపేట మున్సిపాలిటీలో 25 వార్డుల్లో 23 స్థానాల్లో వైసీపీ దక్కించుకొంది. ఒక్కొక్క స్థానంలో టీడీపీ, జనసేన అభ్యర్ధులు గెలుపొందారు.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంటున్నాయి.ఈ సమయంలో ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీకి కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu