బాబుకు షాక్: ఓటుకు నోటు కేసుపై ఆళ్ల మరో పిటిషన్

Published : Nov 02, 2018, 01:12 PM ISTUpdated : Nov 02, 2018, 01:13 PM IST
బాబుకు షాక్: ఓటుకు నోటు కేసుపై ఆళ్ల మరో పిటిషన్

సారాంశం

ఓటుకు నోటు కేసును త్వరగా విచారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసును త్వరగా విచారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఫిబ్రవరిలో ఈ కేసును లిస్ట్ చేసి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు  ప్రకటించింది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. అయితే తనను ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని రేవంత్ రెడ్డి  ఆరోపణలు చేశారు.

ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కూడ సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఎన్నికల సభల్లో  తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో  సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.

 అయితే రాజకీయ శతృత్వం కారణంగానే చంద్రబాబునాయుడుపై ఈ పిటిషన్ దాఖలు చేశారని  ఏపీ సీఎం తరపు న్యాయవాది సిద్దార్ధ సుప్రీంకోర్టుకు చెప్పారు. గతంలో కూడ ఈ కేసు విచారణ విషయమై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను  ఫిబ్రవరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.


 

PREV
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers