వైసీపీ నేత కేశవరెడ్డి హత్య

Published : Oct 10, 2018, 01:09 PM ISTUpdated : Oct 10, 2018, 01:57 PM IST
వైసీపీ నేత కేశవరెడ్డి హత్య

సారాంశం

:వైసీపీ నేత, ఆత్మకూరు మాజీ సర్పంచ్  కేశవరెడ్డిని  గుర్తు తెలియని దుండగులు బుధవారం నాడు రాళ్లతో కొట్టి చంపారు


అనంతపురం:వైసీపీ నేత, ఆత్మకూరు మాజీ సర్పంచ్  కేశవరెడ్డిని  గుర్తు తెలియని దుండగులు బుధవారం నాడు రాళ్లతో కొట్టి చంపారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో వైసీపీ నేత కేశవరెడ్డి హత్య రాజకీయంగా సంచలనం కల్గిస్తోంది.పాత కక్షలు భగ్గుమన్నాయి. కుటుంబసభ్యుల మధ్య ఉన్న  పాత కక్షల కారణమని  పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసతున్నారు. 

ఘటనా స్థలం నుండి కేశవరెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపుగానే  ఆయన  మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్