జ‌మిలి ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ సిద్ధంగానే ఉంది: పేర్ని నాని

Published : Sep 02, 2023, 10:11 PM IST
జ‌మిలి ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ సిద్ధంగానే ఉంది: పేర్ని నాని

సారాంశం

Vijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి పేర్ని నాని రాబోయే జమిలి ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారు.  అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలలో పాల్గొనడమే తమ ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. జ‌మిలి ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధంగానే ఉందంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.   

Andhra Pradesh Former minister Perni Nani: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి పేర్ని నాని రాబోయే జమిలి ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారు.  అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలలో పాల్గొనడమే తమ ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. జ‌మిలి ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధంగానే ఉందంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఏపీ మాజీ మంత్రి, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయ‌కుడు పేర్ని నాని రాబోయే జమిలి ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారు, అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలలో పాల్గొనడమే తమ ఉద్దేశ‌మ‌ని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా మొదట్లో ఇవ్వని హామీలను నెరవేర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి అని నాని కొనియాడారు. త‌మ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని అన్నారు. ప్ర‌జా సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు.

ఇదే క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పై నమ్మకం ఉంచారని నాని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుకు జోడీగా మారింద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డంపై స్పందిస్తూ.. కేంద్రంలో ప్రధాని మోడీ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి, దేశానికి మేలు జరిగితే వైఎస్ఆర్సీపీ  మద్దతిస్తుందని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌