కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం : వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 02, 2024, 06:57 PM ISTUpdated : Jan 02, 2024, 07:01 PM IST
కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం : వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్ ‌పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ఇది వరకే నిర్ణయించామన్నారు. మంగళవారం ఇడుపులపాయలో తన తండ్రి , దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరిని తీసుకుని ఆమె అక్కడికి వెళ్లారు.

కాంగ్రెస్ ‌పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ఇది వరకే నిర్ణయించామన్నారు. మంగళవారం ఇడుపులపాయలో తన తండ్రి , దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరిని తీసుకుని ఆమె అక్కడికి వెళ్లారు.

కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నామని .. అందుకే తెలంగాణలో ఆ పార్టీకి మద్ధతిచ్చానని చెప్పారు. మా మద్ధతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవడానికి తాము పోటీ పెట్టకపోవడమే కారణమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నానని.. రెండ్రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని షర్మిల తెలిపారు.  తన కుమారుడికి వివాహం నిశ్చయమైన సందర్భంగా వైఎస్సార్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయ వచ్చినట్లు వెల్లడించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu