రేపు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన.. బ్యారేజ్ లు జాతికి అంకితం ఇవ్వనున్న సీఎం...

By Bukka SumabalaFirst Published Sep 5, 2022, 11:51 AM IST
Highlights

రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 

అమరావతి : మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన చేయనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు సీఎం. దాని అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. బ్యారేజ్ లను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ వీటిని జాతికి అంకితం చేయనున్నారు.  

మంగళవారం వైఎస్ జగన్ షెడ్యూల్ ఇలా ఉంది.. 
- 6వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్

-10.40 గంటలకు సంగం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు.

- 11 గంటల నుంచి 1.10 వరకూ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించి, అక్కడే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.

- 1.20 గంటలకు సంగం నుంచి బయదేరి  1.45 కు నెల్లూరు బ్యారేజి సైట్ కు చేరుకోనున్న సీఎం జగన్.

-1.50 గంటల నుంచి 2.20 గంటల వరకూ నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్న సీఎం జగన్.

- 2.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్.

అనంతపురం జిల్లా డోనెకల్ వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. బళ్లారి వెళ్తుండగా ఘటన

click me!