తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

మ‌రో 25 ఏండ్లు ఏపీలో జ‌గ‌న్ పాల‌నే.. : వైఎస్ఆర్సీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి

Mahesh Rajamoni | Updated : Oct 29 2023, 05:54 AM IST

MP V. Vijayasai Reddy: వచ్చే 25 ఏళ్లు ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలన కొనసాగుతుందని అధికార వైఎస్ఆర్సీపీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ పాలనను సామాజిక విప్లవంతో పోల్చిన ఆయన ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పాలనా సంస్కరణలు బడుగు బలహీన వర్గాలకు మేలు చేశాయన్నారు. జగన్ మోహ‌న్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నార‌ని తెలిపారు.   

YSRCP-Samajika Sadhikara Bus Yatra: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు చాప్టర్‌ క్లోజ్‌ అయిందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం బాప‌ట్ల‌లో సామాజిక సాధికారత కోసం చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొన్న ఆయన.. టీడీపీ అధ్యక్షుడు తన కుటుంబాన్ని మాత్రమే ఆదుకుంటున్నారనీ, అణగారిన వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. "అందుకే ప్రజలు అతని గురించి పట్టించుకోరు. మా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్లు, సంక్షేమ పథకాలను టీడీపీ కడుపులో పెట్టుకోలేకపోతోంది. చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని" చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డి.పురందేశ్వరి ఆరోపణలపై స్పందిస్తూ.. ఆమెది అస్థిర రాజకీయమని వ్యాఖ్యానించారు. ఆమెకు సొంత నియోజ‌క‌వ‌ర్గం ఏదీ లేద‌నీ, వ్య‌క్తిగ‌త అజెండాతో స్వార్థ రాజ‌కీయాల్లో మునిగిపోయార‌ని విమ‌ర్శించారు. లిక్కర్ డీల్స్‌లో తనపై చేసిన నిరాధార ఆరోపణలను ఖండించిన విజయ సాయి రెడ్డి, ఇతరులపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు.

వచ్చే 25 ఏళ్లు ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలన కొనసాగుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ పాలనను సామాజిక విప్లవంతో పోల్చిన ఆయన ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పాలనా సంస్కరణలు బడుగు బలహీన వర్గాలకు మేలు చేశాయన్నారు. జగన్ మోహ‌న్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నార‌ని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఆయ‌న‌.. తిరుప‌తిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ ఆర్ శిరీష యాదవ్, డిప్యూటీ మేయర్ బి.అభినయ్ రెడ్డితో కలిసి 'సామాజిక సాధన బస్సు యాత్ర'లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాలు మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని తెలిపారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు,  మైనారిటీల ఘనమైన మద్దతు వల్ల పార్టీ హాయిగా ముందుకు సాగిపోతుందని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. గత నాలుగున్నరేళ్లలో అణగారిన వర్గాల కోసం ప్రభుత్వం చాలా చేసిందనీ, రాష్ట్ర ప్రజలకు కూడా అది బాగా తెలుసు అని ఆయన అన్నారు. టీడీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి, రాష్ట్రానికి ఎంతో కొంత చేసిందని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుపై విమ‌ర్శలు గుప్పించారు. “జగన్ అందించిన చురుకైన పాలనతో 14 ఏళ్ల పాల‌నలో ఉన్న చంద్ర‌బాబు ముఖ్యమంత్రిగా ప్రజల జ్ఞాపకం నుండి మసకబారింది” అని ఆయన దుయ్యబట్టారు.

Read more Articles on
click me!