జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ మళ్లీ వాయిదా

Published : Oct 21, 2020, 03:16 PM IST
జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ మళ్లీ వాయిదా

సారాంశం

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉండడంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15న జరగాల్సిన విచారణ.. 20వ తేదీకి వాయిదా పడింది. కాగా.. మంగళవారం విచారణకు రావాల్సిన ఈ కేసును మళ్లీ 27వ తేదీకి వాయిదా వేశారు.

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉండడంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. ఇదిలావుంటే, మెట్రో పాలిటన్‌ సెషన్‌ జడ్జి(ఎంఎ్‌సజే కోర్టు) పరిధిలో ఉన్న ఈడీ కేసు నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. 

కాగా, జగన్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈ కేసును కూడా బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబరు 5వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు. సీఎం జగన్‌కు సంబంధించిన అన్ని కేసులు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉండగా, ఈడీ కేసు మాత్రం ఎంఎ్‌సజే కోర్టు విచారణలో ఉంది.

PREV
click me!

Recommended Stories

Anshu Malika Emotional Speech 🔥 RK Roja Daughter Wins Prestigious Award in USA | Asianet News Telugu
CM Chandrababu Birthday: చంద్రబాబుకి బర్త్ డే గిఫ్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత భోజనం | Asianet Telugu