ప్రధానికి జగన్ తాజా ట్వీట్

First Published Apr 9, 2018, 1:46 PM IST
Highlights
ప్రత్యేకహోదా ప్రకటించాలని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి విజ్ఞప్తి చేశారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తమ పార్టీ ఎంపిల ప్రాణాలు నిలిపేందుకు, ఏపి ప్రజల భవిష్యత్తు కోసం వెంటనే ప్రత్యేకహోదా ప్రకటించాలని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపటి క్రితం జగన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోడిని కోరారు.

తమ ఎంపిలు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి సోమవారానికి నాలుగు రోజులైందన్నారు. ఇప్పటికే మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయాన్ని కూడా జగన్ ప్రధానికి వివరించారు.

కాబట్టి ఏపి భవిష్యత్తు కోసం, ప్రజల ఆకాంక్షలమేరకు గతంలో హామీ ఇచ్చినట్లు ప్రత్యేకహోదా ప్రకటించాలన్నారు. 

 

Our MPs are on hunger strike for the 4th day now. MRR,VP & YVSR have already been hospitalised. ji, the lives of these MPs & the future of the people of AP are at stake. Requesting you to please fulfill the promise you made to us on SpecialCategoryStatus.

— YS Jagan Mohan Reddy (@ysjagan)
click me!