జూన్ 8న జగన్ కేబినెట్: 15 మందికి ఛాన్స్

Siva Kodati |  
Published : May 31, 2019, 11:14 AM ISTUpdated : May 31, 2019, 11:21 AM IST
జూన్ 8న జగన్ కేబినెట్: 15 మందికి ఛాన్స్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం జూన్ 8న కొలువు దీరనుంది. కేబినెట్‌లో 15 మందికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జూన్ 11 తర్వాత మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం జూన్ 8న కొలువు దీరనుంది. కేబినెట్‌లో 15 మందికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జూన్ 11 తర్వాత మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ పాలనను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం డీజీపీతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే అధికార యంత్రాంగంలో సమూల మార్పులు చేపట్టారు వైఎస్ జగన్.. సీఎంవోలోని కీలక అధికారులపై వేటు వేసిన సీఎం, డీజీపీ ఠాకూర్, ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరావును బదిలీ చేశారు. శనివారం లోగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సైతం స్థాన చలనం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

నారా లోకేష్ గారి కృషితో ఆర్డీటీ సేవలు పునరుద్దరణ : మంత్రి సవిత| Asianet News Telugu
TB Free India: కేవలం 2 నిమిషాల్లో టీబీ గుర్తింపు.. ఏపీలో కొత్త టెక్నాలజీ షురూ !