సరదాగా అన్నమాటే నిజమైంది... ఇదే చివరి రోజంటూ...

Published : Jan 02, 2020, 10:10 AM ISTUpdated : Jan 02, 2020, 10:14 AM IST
సరదాగా అన్నమాటే నిజమైంది... ఇదే చివరి రోజంటూ...

సారాంశం

 ‘ ఒరేయ్ బావా...చూడు, ఇదే నా చివరి సెల్ఫీ.. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా.. అందుకే ఇదే చివరిది’ అంటూ సరదాగా ఫ్రెండ్ తో అన్నమాటలు ఆ యువకుడి విషయంలో నిజమయ్యాయి. 

అందరం న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టాం. డిసెంబర్ 31 వ తేదీన అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు సరదాగా చెప్పిన మాటలే అతని జీవితంలో నిజమయ్యాయి. డిసెంబర్ 31వ తేదీన ఓ యువకుడు చివరగా సెల్ఫీ తీసుకొని అదే చివరిదంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ‘ ఒరేయ్ బావా...చూడు, ఇదే నా చివరి సెల్ఫీ.. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా.. అందుకే ఇదే చివరిది’ అంటూ సరదాగా ఫ్రెండ్ తో అన్నమాటలు ఆ యువకుడి విషయంలో నిజమయ్యాయి. ఇవే మాటలతో అతను టిక్ టాక్ చేశాడు. విజయనగరం జిల్లా బొండవల్లి మండలం ఎం.కొత్తవలసకు చెందిన ఎం.వినోద్ గంట్యాడ మండలం పెదమజ్జిపాలెంకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి వరకు ఆనందంగా గడిపాడు.

ఈ సంవత్సరానికి ఇదే చివరి సెల్ఫీ అంటూ వీడియో చిత్రీకరించి పెట్టాడు. ఇది చిత్రీకరించిన కొద్ది గంటలకే ముగ్గురూ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బొండవల్లి మండలం యడ్లపాలెం సమీపంలో అర్థరాత్రి దాటాక తాటి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో వినోద్ పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. మిగిలిన ఇద్దరూ గాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu