విజయవాడ: ప్రియుడి ఇంట్లో శవమై తేలిన చార్టెట్ అకౌంటెంట్... హత్యా, ఆత్మహత్యా..?

Siva Kodati |  
Published : Aug 21, 2021, 08:20 PM IST
విజయవాడ: ప్రియుడి ఇంట్లో శవమై తేలిన చార్టెట్ అకౌంటెంట్... హత్యా, ఆత్మహత్యా..?

సారాంశం

విజయవాడలో యువ ఛార్టెడ్ అకౌంటెంట్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రియుడు చెబుతుంటే.. తమ  బిడ్డను అతనే పొట్టనపెట్టుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.   

విజయవాడలో యువతి మృతి కలకలం  రేపుతోంది. ఛార్టెడ్ అకౌంటెంట్  చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెతో సన్నిహితంగా వుంటున్న ప్రసేన్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లుగా మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె ముఖంపై గాయాలు వుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రసేన్ - సింధు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. లాక్‌డౌన్ తర్వాత సింధు.. ప్రసేన్‌కు చెందిన  ఇంట్లో ఉంటోంది. అయితే నిన్నటి నుంచి ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ప్రసేన్‌కు ఫోన్ చేశారు సింధు తల్లిదండ్రులు. దాంతో సింధు వున్న ఇంటికి వెళ్లాడు ప్రసేన్. సింధు ఆత్మహత్య చేసుకుంది అతను వారితో చెప్పాడు. ఆమె పేరెంట్స్ వెళ్లి చూడగా.. మొహం మీద గాయాలు వున్నట్లుగా గుర్తించారు. ప్రసేన్ హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?