‘ఏపీలో వైసీపీ ఎంపీలే హీరోలు’

Published : Jun 07, 2018, 03:57 PM IST
‘ఏపీలో వైసీపీ ఎంపీలే హీరోలు’

సారాంశం

హోదా కోసం రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు

ఇప్పుడు ఏపీలో వైసీపీ ఎంపీలే హీరోలని కేఆర్‌పీఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి  ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ.. వైసీపీ ఎంపీలు ఏప్రిల్ నెలలో తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వారి రాజీనామాలను ఇటీవల పార్లమెంట్  స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఆ ఎంపీ స్థానాలకు ఉప ఎన్నిక ఉంటుందా..? ఉండదా అనే విషయంపై ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు.

కాగా.. ఈ విషయంపై కేఆర్ పీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ కలిమిలి రాం ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎంపీలు  రాజీనామాలు చేసీ ప్రజల్లో హీరోలయ్యారన్నారు. అధికార పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే కచ్చితంగా రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేదని ఆయన అన్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
Pawan Kalyan Fan Niranjan అభిమాని కోసం పవన్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు| Asianet Telugu