ఔను.. దాడి చేసింది మా వాళ్లే.. వైసీపీ ఎమ్మెల్యే

Published : Apr 18, 2019, 01:57 PM IST
ఔను.. దాడి చేసింది మా వాళ్లే.. వైసీపీ ఎమ్మెల్యే

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. టీఎన్‌ఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో నిందితులు తనవాళ్లేనని ఆయన అంగీకరించారు.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. టీఎన్‌ఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో నిందితులు తనవాళ్లేనని ఆయన అంగీకరించారు.

గురువారం ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కేసులో నిందితులు తన అనుచరులేనని, దీనిలో రెండో ఆలోచనకు తావు లేదన్నారు. తానేమీ దాచి పెట్టడం లేదని.. ఈ కేసులో అరెస్టైన వారంతా ఎన్నికల్లో తనతోపాటు పనిచేసిన వారేనన్నారు. 

దాడులను, రౌడీ రాజకీయాలను ప్రోత్సహించబోనన్న ఆయన తిరుమలనాయుడిపై దాడిని తన వాళ్లే చేశారన్న దానిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నారు. అయితే పోలీసులు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నానన్నారు.

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల‌లో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయ‌కూడ‌దా.? ఇలాంటి నిబంధ‌న‌లు ఇంకేం ఉన్నాయి.?
తెలుగు కపుల్స్ కి బంపరాఫర్... మూడో బిడ్డను కంటే డబ్బులకు డబ్బులు, సెలవులకు సెలవులు