తిరుమలలో వైసీపీ ప్రచార సామగ్రిపై వెల్లువెత్తుతున్న నిరసనలు.. టీటీడీ విచారణ..

Published : Apr 27, 2023, 11:36 AM IST
తిరుమలలో వైసీపీ ప్రచార సామగ్రిపై వెల్లువెత్తుతున్న నిరసనలు.. టీటీడీ విచారణ..

సారాంశం

తిరుమలలో వైసీపీ ప్రచార సామాగ్రి కలకలం రేపుతోంది. తీవ్ర నిరసనలకు దారి తీస్తోంది. దీనిమీద టీటీడీ విచారణ చేపట్టింది. 

తిరుపతి : ఆంక్షలు ఉన్నప్పటికీ అధికార వైఎస్సార్‌సీపీ ప్రచార సామాగ్రి తిరుమలకు ఎలా చేరుతోందనే దానిపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం విచారణకు ఆదేశించింది. తిరుమలలోని బాలాజీ నగర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్నే మా నమ్మకం కార్యక్రమంపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమలలో పార్టీ జెండాలు, ప్రచార సామాగ్రి ప్రదర్శించడం పూర్తిగా నిషేధం. అలిపిరి వద్ద టిటిడి భద్రత కల్పించడం వల్ల వైఎస్ఆర్‌సి కార్యకర్తలు తమ పార్టీ పోస్టర్లను తిరుమలకు తీసుకెళ్లడమే కాకుండా బాలాజీ నగర్ నివాస ప్రాంతంలోని ఇళ్లకు పార్టీ స్టిక్కర్లను ఎలా అంటించారని తెలుగుదేశం, బిజెపి, జనసేన, ఇతర రాజకీయ పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

అల్లూరి జిల్లాలో ఘోరం... లోయలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

వైఎస్సార్‌సీపీ అధికారాన్ని దుర్వినియోగం చేసి తిరుమల పవిత్రతను పాడుచేస్తోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌, కాంగ్రెస్‌ నేత నవీన్‌రెడ్డి ఆరోపించారు. ‘తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలు చేయడం నిషిద్ధం.. ఇది చట్ట ప్రకారం నేరం.. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిఘా, పోలీసు సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలి" అని నవీన్‌రెడ్డి హెచ్చరించాడు.

టిటిడి మాజీ బోర్డు సభ్యుడు, బిజెపి నాయకుడు భాను ప్రకాష్ కూడా తిరుమలలో ఇళ్లపై వైఎస్ఆర్సి స్టిక్కర్లను అతికించడంపై మాట్లాడారు. "ఇటీవల, అలిపిరి వద్ద టిటిడి విజిలెన్స్ విభాగం కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాం ఉందని మహారాష్ట్ర వాహనంలో ప్రవేశాన్ని నిరాకరించింది" అని పేర్కొన్నారు.

మాజీ బోర్డు సభ్యుడు తప్పు చేసిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా "తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు" వైసీపీని ఖండించారు.

PREV
click me!

Recommended Stories

స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy