మద్యం మత్తులో భర్త పురుషాంగాన్ని కోసేసి హత్య... ఓ భార్య ఘాతుకం..

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 10:23 AM IST
Highlights

రాపాక గ్రామ శివారు కల్వర్టు వద్ద మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు రావడంతో అక్కడికి చేరుకున్నారు. అది అబ్బులు మృతదేహంగా గుర్తించారు. తన భర్త  ఫిట్స్ వల్లే చనిపోయాడని మృతదేహాన్ని ముత్యాలు దహన సంస్కారాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మృతదేహంపై గాయాలు ఉండడం, పురుషాంగం కోసేసి ఉండడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో  మృతుడి భార్యే హత్య చేసినట్లు అంగీకరించింది. 

సీతానగరం : తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. liquor మత్తులో విచక్షణ కోల్పోయిన భార్య.. కట్టుకున్న భర్తనే అతికిరాతకంగా murder చేసింది. ఆ తరువాత ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగివచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... సీతానగరం మండలం రఘుదేవపురం చెందిన మర్రే అబ్బులు (46), ముత్యాలు భార్యాభర్తలు. వీరికి మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం రాత్రి కూడా ఇద్దరూ తాగి గొడవపడి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయారు.  

తెల్లవారుజామున ముత్యాలు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది. రాపాక గ్రామ శివారు కల్వర్టు వద్ద dead body ఉందని పోలీసులకు ఫిర్యాదు రావడంతో అక్కడికి చేరుకున్నారు. అది అబ్బులు మృతదేహంగా గుర్తించారు. తన భర్త  Fits వల్లే చనిపోయాడని మృతదేహాన్ని ముత్యాలు దహన సంస్కారాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మృతదేహంపై గాయాలు ఉండడం, Penis కోసేసి ఉండడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో  మృతుడి భార్యే హత్య చేసినట్లు అంగీకరించింది. 

ఇదిలా ఉండగా, haryanaలో ఓ భార్య ఘాతుకానికి తెగబడింది. కట్టుకున్న husbandనే అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించింది. అతను చనిపోయాడనుకుని, cash and jewelleryతో ఉడాయించింది. ఆమెను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు పురుషుల్ని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన Faridabadలో జనవరి 17 -18 మధ్య రాత్రి జరిగింది. ఆ మహిళ భర్తను చంపడానికి ప్రయత్నించి, నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులతో పారిపోయిందని తేలింది. దీనికోసం మహిళ భర్త ఆహారంలో sedatives కలిపి.. అతని మీద దాడి చేసింది. మత్తుమందుతో బాధితుడు మైకంలో ఉన్నప్పుడు ఇద్దరు పురుషులతో కలిసి దుప్పటి ముసుగేసి మహిళ సుమారు 20 నిమిషాల పాటు అతని మీద దాడి చేసింది. అచేతనంగా పడి ఉన్న అతను చనిపోయాడని భావించిన వారు ఇంటిని దోచుకున్నారు. నగదు, నగలు, ఇంట్లోని విలువైన వస్తువులతో పారిపోయారు.  

ఆ రాత్రి ఏం జరిగిందంటే...ఈ ఘటన జరిగిన జనవరి 17, 18వ తేదీ మధ్య రాత్రి భోజనానికి ముందు దంపతుల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.  అయితే 45 ఏళ్ల బాధితుడు తన భార్యతో నిత్యం గొడవపడేవాడని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) నరేందర్ కడియన్ పేర్కొన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ తరువాత భార్య భర్త ఆహారంలో మత్తుమందు కలిపింది. అది తిన్న భర్త మత్తులోకి జారుకోగానే.. భర్త ముఖాన్ని దుప్పటితో కప్పి.. దాదాపు 20 నిమిషాల పాటు కొట్టింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే పోలీసుల కథనం ప్రకారం, బాధితుడు తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం గురించి తెలుసుకున్నాడు. ఇద్దరిమధ్య కొద్దిరోజులు గొడవలు అయ్యి, పరిస్థితులు మళ్లీ మామూలు అయ్యాయి. అయితే బాధితుడు భార్య ఫోన్ చెక్ చేసినప్పుడు అవతలి వ్యక్తి తన అప్పులు తీర్చడానికి త్వరగా డబ్బు సంపాదించాలని.. ఆమెను పెట్టిన మెసేజ్ లు కనిపించాయి. 

click me!