పెళ్లి చేసుకోవాలని యువతిని కత్తితో బెదిరించిన యువకుడు: పోలీసులకు ఫిర్యాదు

Published : Nov 11, 2020, 11:38 AM IST
పెళ్లి చేసుకోవాలని యువతిని కత్తితో బెదిరించిన యువకుడు: పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకోవాలని యువతిని ఓ వ్యక్తి కత్తితో బెదిరించాడు.ఈ విషయమై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


విజయవాడ: ప్రేమించి పెళ్లి చేసుకోవాలని యువతిని ఓ వ్యక్తి కత్తితో బెదిరించాడు.ఈ విషయమై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ గవర్నర్ పేట -1 డిపోలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఓ యువతి విధులు నిర్వహిస్తోంది. అదే బస్ డిపోలో మెకానిక్ గా అజయ్ కుమార్ పనిచేస్తున్నాడు. ఒకే డిపోలో పనిచేస్తున్నందున ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని అజయ్ భావించాడు.

ప్రేమ పేరుతో ఆమెను వేధించాడని  బాధితురాలు ఆరోపిస్తోంది. ఇటీవలనే ఆ యువతికి వేరే యువకుడితో వివాహం నిశ్చయమైంది.ఈ విషయం తెలిసిన అజయ్ కుమార్ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించాడు. తననే పెళ్లి చేసుకోవాలని  హెచ్చరించాడు.  తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించారు.

ఈ విషయమై ఆమె సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu