అనాథనని, కొత్త జీవితం ఇవ్వాలంటూ వల: యువకుడి నుంచి 15 లక్షలు దోచేసిన కిలాడీ లేడీ

By Siva KodatiFirst Published Jun 13, 2021, 4:18 PM IST
Highlights

తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సుహాసిని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈమె రెండో భర్త తెరపైకి వచ్చారు. తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని బాధితుడు వినయ్ ఆరోపిస్తున్నారు

తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సుహాసిని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈమె రెండో భర్త తెరపైకి వచ్చారు. తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని బాధితుడు వినయ్ ఆరోపిస్తున్నారు. అనాథ అంటూ తనను వివాహం చేసుకుని రూ.15 లక్షల నగదు, నగలతో పరారైనట్లుగా ఆయన వెల్లడించారు. మొదటి భర్త, బావ అయిన వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె మోసాలకు పాల్పడుతున్నట్లుగా వినయ్ తెలిపారు. దీంతో సుహాసినీని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

click me!