ప్రేమించి పెళ్లి: మరొకరితో ఎఫైర్, భర్తను చంపిన భార్య

By narsimha lodeFirst Published Feb 21, 2021, 2:21 PM IST
Highlights

వివాహేతర సంబంధంతో ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపింది భార్య. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని తూర్పు వీధికి చెందిన రూపేష్ హత్యకు గురయ్యాడు.ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 


నెల్లూరు: వివాహేతర సంబంధంతో ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపింది భార్య. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని తూర్పు వీధికి చెందిన రూపేష్ హత్యకు గురయ్యాడు.ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

తూర్పు వీధికి చెందిన రాజేశ్వరమ్మ కొడుకు రూపేష్ ఏడేళ్ల క్రితం మానస అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. రూపేష్ ఎలక్ట్రీషీయన్  గా పనిచేస్తున్నాడు. రూపేష్ తన భార్యతో కలిసిన నరసయ్యగుంటలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు.

మానస కొంతకాలంగా గూడూరు మండలం కొండాగుంటకు చెందిన రవివర్మతో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న  రూపేష్ భార్యను మందలించాడు. భర్త అడ్డుతొలగించుకొంటేనే ప్రియుడితో వివాహేతర సంబంధానికి ఇబ్బందులు ఉంటాయని ఆమె భావించింది.

ఈ విషయమై ప్రియుడు రవివర్మతో కలిసి భర్తను హత్యకు ప్రణాళిక రూపొందించింది.  నాలుగు రోజుల క్రితం మానస పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం ప్రియుడికి సమాచారం ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన నిద్రపోతున్న రూపేష్ తలపై ఇనుప రాడ్ తో కొట్టారు. ఈ సమయంలో  ప్రియుడితో ప్రియురాలు కూడ జత కలిసింది.

రూపేష్ మృతిపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. భార్యే ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్టుగా తేలింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల నుండి ఇంకా వివరాలను సేకరించనున్నారు. 
 

click me!