విజయనగరం రైలు ప్రమాదం : పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు..

Published : Oct 30, 2023, 07:51 AM IST
విజయనగరం రైలు ప్రమాదం : పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు..

సారాంశం

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని మరికొన్ని దారి మళ్లించింది రైల్వే శాఖ.

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం దగ్గర జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు రైళ్ల రద్దయ్యాయి. విశాఖ-రాయపూర్ ప్యాసింజర్ రైలు రద్దు, విశాఖ రాయపూర్ మధ్య నడిచే కొర్చా రైలు రద్దు, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం - గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. ఇక కోణార్క్, ఫలక్ నుమా, నాగవల్లి రైళ్లను విజయనగరం, టిట్లాగఢ్, నాగపూర్, కాజీపేట మీదుగా దారి మళ్లించారు. పూరీ- తిరుపతి రైలును బల్గాం దగ్గర నిలిపివేశారు.
 
రైలు ప్రమాద స్థానిక రెస్క్యూ ఆపరేషన్ టీం చేరుకుంది. రైల్వే అధికారులు బాహుబలి క్రేన్ ను రంగంలోకి దించారు. నుజ్జునుజైన బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. 54మందికి పైగా గాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్