
ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖలో మీడియాలో మాట్లాడిన ఆయన ఏపీ గూండాల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.
ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని సీఎం చుట్టూ ఉన్న మంత్రుల వల్లే టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించారు. రైల్వేజోన్ వస్తుందని తెలిసి కూడా మంత్రి గంటా అనవసరంగా నిరసనలు చేస్తున్నారని విష్ణుకుమార్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ఆరోపించారు.