చంద్రబాబుకి ఘన సన్మానం చేస్తానంటున్న ముద్రగడ

Published : Sep 04, 2018, 12:58 PM ISTUpdated : Sep 09, 2018, 11:21 AM IST
చంద్రబాబుకి ఘన సన్మానం చేస్తానంటున్న ముద్రగడ

సారాంశం

చంద్రబాబుకు లక్ష మందితో ఘన సన్మానం చేస్తామని ముద్రగడ పద్మనాభం తెలిపారు.

కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కాపులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పట్టుబట్టారు. కాపులకు ఇచ్చిన హామీని నెరవేరిస్తే చంద్రబాబుకు లక్ష మందితో ఘన సన్మానం చేస్తామని ముద్రగడ పద్మనాభం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పత్తి పంటకి చీడ పడితే ఈ రైతు చేసేది విని సీఎం షాక్| CM Chandrababu Kuppam farmers interaction
CM Chandrababu: ప్రపంచంలోని టూరిస్ట్ లను మన ప్రకృతి సేద్యాన్ని చూడటానికి తీసుకొస్తా | Asianet Telugu