ఎమ్మెల్యే కన్నబాబుకి టోకరా: నకిలీ పత్రాలతో భూమి విక్రయించిన ఇద్దరి అరెస్ట్

Published : Sep 06, 2021, 05:58 PM IST
ఎమ్మెల్యే కన్నబాబుకి టోకరా: నకిలీ పత్రాలతో భూమి విక్రయించిన ఇద్దరి అరెస్ట్

సారాంశం

విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు  నకిలీ పత్రాలతో భూమిని విక్రయించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి అసలు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు  నకిలీ పత్రాలతో భూమిని విక్రయించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ జిల్లాలోని కొమ్మాది ప్రాంతంలో 12 ఎకరాల 26 సెంట్ల భూమిని ఎమ్మెల్యే  కన్నబాబు కొనుగోలు చేశాడు. ఈ భూమిని ఇద్దరు వ్యక్తులు విక్రయించారు. అయితే ఈ భూమి అసలు యజమానులు  పోలీసులకు ఫిర్యాదు చేుయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

 భూమిని విక్రయించిన వారు నిజమైన యజమానులు అవునో కాదో నిర్ధారించుకోకుండా ఎమ్మెల్యే ఈ భూమిని ఎలా కొనుగోలు చేశారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కన్నబాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఇద్దరు నిందితులు ఎమ్మెల్యేకు భూమిని విక్రయించిన వారి వెనుక ఎవరైనా ఉన్నారా, వీరిద్దరే ఈ  పనికి పూనుకొన్నారా అనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొనే నకిలీ పత్రాలతో ఈ భూమి విక్రయించడం వెనుక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu