ఏజెన్సీలో మతమార్పిడులు.. అంతా ఓ మతం కనుసన్నల్లోనే : స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 25, 2022, 03:55 PM ISTUpdated : Dec 25, 2022, 03:56 PM IST
ఏజెన్సీలో మతమార్పిడులు.. అంతా ఓ మతం కనుసన్నల్లోనే : స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు

సారాంశం

మత మార్పిడులకు సంబంధించి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీలో మత మార్పిడిని ఓ మతం ప్రోత్సహిస్తోందని .. ఇక్కడి వనరుల దోపిడీని అడ్డుకోవాలని ఆయన సూచించారు. 

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏజెన్సీలో మత మార్పిడిని ఓ మతం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వనరుల దోపిడీని ఎదుర్కొనేందుకు గిరిజనులు సిద్ధంగా వుండాలి ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించింది శారదా పీఠమేనని స్వరూపానందేంద్ర గుర్తుచేశారు. 

ఇదిలావుండగా... వచ్చే నెల 27 నుంచి శారదా పీఠం వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆశ్రమ వర్గాలు సీఎం జగన్‌ను ఆహ్వానించాయి. ఈ మేరకు శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ నెల 15న తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆయనకు స్వాత్మానందేంద్ర వేదాశీర్వచనం అందించారు. 


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే