దిశ యాక్ట్ తో సత్వర న్యాయం... వెంకయ్యనాయుడు

By telugu teamFirst Published Dec 14, 2019, 11:55 AM IST
Highlights

ఈ దిశ యాక్ట్ పై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా స్పందించారు. దిశ యాక్ట్ తీసుకు వచ్చినందుకు ఏపీ ప్రభుత్వాన్ని వెంకయ్య నాయుడు అభినందించారు. దిశ యాక్ట్ వల్ల సత్వర న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 

దిశ యాక్ట్ తో సత్వర న్యాయం జరుగుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మహిళా సంరక్షణ కోంసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దిశా యాక్ట్ ను తీసుకువచ్చింది. ఇదివరకే ఈ బిల్లుకు సీఎం జగన్ సారథ్యంలోని మంత్రిమండలి ఆమోదించగా శుక్రవారం అసెంబ్లీ ఆమోదాన్ని కూడా  పొందింది.
 

ఇలా మహిళలపై జరుగులతున్న అఘాయిత్యాలను అడ్డుకోడానికి నిబద్దతతో పనిచేస్తూ కఠిన చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర మహిళా లోకం ప్రశంసలు కురిపిస్తోంది.

కాగా... ఈ దిశ యాక్ట్ పై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా స్పందించారు. దిశ యాక్ట్ తీసుకు వచ్చినందుకు ఏపీ ప్రభుత్వాన్ని వెంకయ్య నాయుడు అభినందించారు. దిశ యాక్ట్ వల్ల సత్వర న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

కాగా... రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచార ఘటనలు జరిగితే దిశ యాక్ట్ ద్వారా నిందితులకు కేవలం 21 రోజుల్లో శిక్ష పడేలా చేస్తామని జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ యాక్ట్ కి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. 

click me!