కర్నూల్‌లో భగ్గుమన్న పాతకక్షలు: ఒకరి మృతి

Published : Jan 01, 2020, 10:49 AM IST
కర్నూల్‌లో భగ్గుమన్న పాతకక్షలు: ఒకరి మృతి

సారాంశం

కర్నూల్ జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 


కర్నూల్:కొత్త సంవత్సరం వేడుకల్లో పాత కక్షలు  పురివిప్పాయి. కత్తులతో దాడికి దిగడంతో ఉపేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కర్నూల్‌ జిల్లా మహానంది మండలంలోని ఈశ్వర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో పాతకక్షలు పురివిప్పాయి. ఎరుకలి ఉపేంద్ర,  రాజశేఖర్, నాగార్జునలపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు.

ఈ ఘటనలో ఎరుకలి ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు.  రాజశేఖర్, నాగార్జునలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రాజశేఖర్, నాగార్జునలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

DMK Leader O. Panneerselvam Offers Prayers at Tirumala | Asianet News Telugu
CM Chandrababu Speech: రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు | Asianet News Telugu