బెజవాడలో టీడీపీ నేతపై దుండగుల దాడి... తీవ్ర గాయాలు

By Siva KodatiFirst Published Sep 3, 2022, 7:00 PM IST
Highlights

విజయవాడలో టీడీపీ నేత, మాజీ కార్పోరేటర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడిని చెన్నుపాటి గాంధీగా గుర్తించారు.

విజయవాడలో టీడీపీ నేత, మాజీ కార్పోరేటర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడిని చెన్నుపాటి గాంధీగా గుర్తించారు. శనివారం పటమట లంకలో తనపై దాడి జరిగినట్లుగా గాంధీ చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, నేతలు అతనిని పరామర్శించారు. రాజకీయ కారణాల వల్లే దాడి జరిగిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!