బావిలో తేలుతున్నగుర్తుతెలియని శవం.. ! (వీడియో)

By AN TeluguFirst Published Jan 26, 2021, 12:28 PM IST
Highlights

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దారుణం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం లో వెల్దుర్తిపాడు గ్రామ ఊరి బయట పొలాల్లోని బావి నీటిలో గుర్తు తెలియని వ్యక్తి  మృత దేహం తేలింది. దీంతో గ్రామంలో కలకలం చెలరేగింది. 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దారుణం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం లో వెల్దుర్తిపాడు గ్రామ ఊరి బయట పొలాల్లోని బావి నీటిలో గుర్తు తెలియని వ్యక్తి  మృత దేహం తేలింది. దీంతో గ్రామంలో కలకలం చెలరేగింది. 

"

వివరాల్లోకి వెడితే... బావి పక్కనున్న పొలం వాళ్లు పొలంలో మందు కొట్టడానికి వెళ్లారు. దీనికోసం నీళ్లు ముంచుకుందామని బావి దగ్గరికి వెళ్లారు. అక్కడ నీటిమీద తేలుతూ మృతదేహం కనిపించడంతో వారు భయంతో షాక్ అయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అనుమానాస్పద మృత దేహాన్ని ప్రక్కకు తిప్పి చూడడానికి కూడా ప్రజలు  భయ పడుతుండడంతో చనిపోయింది ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. 

click me!